Mobile Popup Ad
Mobile Popup Ad

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు..!

కలం, వెబ్​ డెస్క్​ : శాంతి చర్చల్లో భాగంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కొన్నాళుగా బ్రేక్​ పడింది. ఈ క్రమంలో ఆయా దేశాలతో పాటు ప్రపంచం కూడా ప్రశాంతంగా ఉంది. అయితే, ఇప్పుడు మళ్లీ పశ్చిమ ఆసియా దేశాల్లో అగ్గి రాజుకుంది. సోమవారం రోజు ఇజ్రాయెల్​, ఇరాన్​ దేశాలు (israel – iran tensions) ఒకదానిపై ఒకటి తీవ్రదాడులు చేసుకున్నాయి. ఇజ్రాయెల్​ పై ఇరాన్ దాడికి దిగగా.. ఇరాన్​ లోని పలు నగరాలపై ఇజ్రాయెల్​ డ్రోన్​ దాడులతో విరుచుకుపడింది. కాగా, కాల్పుల విరమణ కొనసాగుతున్న వేళ ఇలాంటి యుద్ధవాతావరణం మళ్లీ నివురుగప్పుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.

ఈ పరిస్థితులపై సమాచారం తెలిసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ఇరు దేశాల తీరును ఖండించారు. దాడులు నిలిపివేయాలని ఇజ్రాయెల్​, ఇరాన్​ లకు హెచ్చరికలు జారీ చేశారు. ఇజ్రాయెల్​ ప్రధానమంత్రి నేతన్యాహుకు ట్రంప్​ ఫోన్​ చేసి ఆరా తీశారు. దీంతో రెండు దేశాలు దాడులను ఆపేశాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రభుత్వం తమ పౌరులకు పలు సూచనలు జారీ చేసింది. ఇరాన్​, ఇజ్రాయెల్​ దాడుల నేపథ్యంలో ఆ దేశాలకు వెళ్లే ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని.. అనవసర టూర్లు రద్దు చేసుకోవాలని కోరింది. ఆ దేశాల్లో ఉన్న భారతీయులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా భారత్​ కు రావాలని సూచించంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>