epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఇరాన్​ కు వెళ్లకండి.. భారత ప్రభుత్వం కీలక ప్రకటన

కలం, వెబ్​ డెస్క్​ : ఇరాన్ లో హింసాత్మక నిరసనలు కొనసాగుతున్న భారత ప్రభుత్వం తమ పౌరులకు కీలక సూచనలు చేసింది. ఇరాన్ కు అనవసరంగా వెళ్లే వారు తమ ప్రయాణాలను (Iran Travel) రద్దు చేసుకోవాలని సోమవారం భారత విదేశాంగ శాఖ (Ministry of External Affairs India) ప్రకటన జారీ చేసింది. తదుపరి నోటీసులు వచ్చేవరకు సూచనలు పాటించాలని కోరింది. ప్రస్తుతం ఇరాన్ లో ఉన్న పరిస్థితుల దృష్ట్యా భారతీయ పౌరులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

నిరసనలు, ప్రదర్శనలు కొనసాగుతున్న ప్రాంతాలకు దూరంగా ఉండాలని, భారత రాయబార కార్యాలయం వార్తలను, అలాగే వెబ్​ సైట్​, సోషల్​ మీడియా హ్యాండిల్స్​ ను నిశితంగా పరిశీలించాలని సలహా ఇచ్చిన భారత విదేశాంగ శాఖ. నివాస వీసాలపై ఇరాన్ లో నివసిస్తున్న భారత పౌరులు భారత రాయబార కార్యాలయంలో నమోదు చేసుకోకపోతే, నమోదు చేసుకోవాలని భారత ప్రభుత్వం  సూచించింది.

ఇరాన్​ లో తీవ్రమవుతున్న ఆర్తిక సంక్షోభం, కరెన్సీ విలువ తీవ్రంగా పడిపోవడం కారణాలతో ఆ దేశ ప్రజలు నిరసనలు చేపడుతున్నా. ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. వారం రోజుల్లోనే 20 మంది చనిపోగా.. 990 మంది అరెస్ట్​ చేశారు. భద్రతా దళాలు, నిరసనకారుల మధ్య హింసాత్మక ఘర్షణలు చెలరేగుతున్నాయి.

Iran Travel
Iran Travel

Read Also: వచ్చే వారం భారత్​కు జర్మనీ​ ఛాన్సలర్​

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>