కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో (Hyderabad) పసిడి ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు (Gold Prices) వరుసగా పెరుగుతూ వస్తోంది. కేవలం ఏడు రోజుల్లోనే 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై ఏకంగా రూ.5,350 మేర పెరిగి రూ.1,50,930 మార్కుకు చేరుకుంది. అదేవిధంగా ఆభరణాల తయారీలో ఎక్కువగా వాడే 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములపై రూ.4,900 పెరిగింది. ప్రస్తుతం రూ.1,38,350 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, స్థానిక డిమాండ్ పెరగడంతో పసిడి ధరలు ఈ స్థాయిలో పరుగులు పెడుతున్నాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
Read Also: విజయ్ దేవరకొండతో ఫస్ట్ కిస్.. రష్మిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Follow Us On: X(Twitter)

