సంగారెడ్డి జిల్లా : రుద్రారం వద్ద మంజీరా ఫేజ్-2 ప్రధాన పైప్ లైన్లో భారీ లీకేజీ (Water Pipe Leakage) ఏర్పడింది. ఈ భారీ లీకేజీలను అరికట్టడానికి అత్యవసర మరమ్మత్తు పనులు జలమండలి అధికారులు చేపట్టారు. ఈ లీకేజీ వల్ల హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాలో అంతరాయం కలగనుంది.
దీంతో ఎర్రగడ్డ, ఎస్.ఆర్.నగర్, అమీర్ పేట్, కేపీహెచ్ బీ కాలనీ, కూకట్ పల్లి, భాగ్యనగర్ కాలనీ, ప్రగతి నగర్, ఆర్ సి పురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, బీరంగూడ, అమీన్ పూర్, భాగ్యనగర్ కాలనీ చందానగర్, గంగారం, మదీనాగూడ, మియాపూర్ ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయా ప్రాంతాల్లో ప్రజలకు ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేయాలని జల మండలి ఎండీ అశోక్ రెడ్డి ఆదేశించారు.

