కలం, వెబ్ డెస్క్: ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఊరట కలిగిస్తూ తెలంగాణ (Telangana) వ్యాప్తంగా భారీగా వర్షం (Rains) పడుతోంది. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. ఉరుములు, మెరుపులతో దంచికొడుతున్న వర్షంతో హైదరాబాద్ (Hyderabad)లోని రోడ్లన్నీ జలమయమైపోయాయి. వర్షం ఎఫెక్ట్తో పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సైబరాబాద్ పరిధిలో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. గచ్చిబౌలి, మాదాపూర్, హైటెక్ సిటీలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది.
మియాపూర్, చందానగర్, కూకట్పల్లి, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్నగర్, పంజాగుట్టలో ఎడతెరిపిలేని వానతో వాహనదారుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక జిల్లాల్లో పరిస్థితి చూస్తే సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్, వరంగల్లో వాన దంచికొడుతోంది. దీంతో ఆయా జిల్లాల్లో అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

