epaper
Wednesday, February 18, 2026
epaper

సింగరేణిని స్కామ్ లకు నిలయంగా మార్చిన రేవంత్​ : హరీశ్​ రావు

కలం, వెబ్​ డెస్క్​ : సింగరేణిని సీఎం రేవంత్​ రెడ్డి స్కామ్ లకు నిలయంగా మార్చారని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్​ రావు (Harish Rao) తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి మున్సిపాటీలోని క్యాతనపల్లిలో నిర్వహించిన మున్సిపల్​ ప్రచారంలో హరీశ్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. మనం జాగ్రత్త పడకుంటే ఐదారేండ్లలో సింగరేణిని పూర్తిగా దోచుకుంటారని హెచ్చరించారు. సమస్యల నుంచి ప్రజలను డైవర్ట్ చేయడం కాదు.. తెలంగాణ ప్రజలే సీఎం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవి నుంచి డైవర్డ్​ చేస్తారని ఆయన (Harish Rao) తెలిపారు.

సింగరేణిలో జరిగిన స్కామ్ లో మంత్రి వివేక్​ వెంకట స్వామికి వాటా ఉందా అని ప్రశ్నిస్తే మౌనంగా ఎందుకుంటున్నారని నిలదీశారు. రెండేళ్ల తర్వాత మళ్లీ కేసీఆర్​ ప్రభుత్వమే వస్తుందని హరీశ్​ రావు జోస్యం చెప్పారు. మున్సిపల్​ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడించి సీఎం రేవంత్​ రెడ్డిని చీరి చింతకు కట్టాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. కారుకు ఓటు గుద్దుతే రేవంత్​ గూబ గుయ్యిమనాలన్నారు. చెన్నూరులో కాంగ్రెస్​ పై పోరులో పొత్తు పెట్టుకున్న సీపీఐకి హరీశ్​ రావు ధన్యవాదాలు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>