హనుమకొండ కోర్టుకు బాంబు బెదిరింపు..!

కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ కోర్టు (Hanumakonda Court)కు మరోసారి బాంబు బెదిరింపు (Bomb Threat) రావ‌డం కలకలం రేపింది. దీంతో అలర్ట్ అయిన సుబేదారి పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ మధ్య కాలంలో కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ రావడం ఇది మూడోసారి. ప్రతిసారి హడావుడి చేస్తున్న పోలీసులు చివ‌రికి బాంబు లేదని తెలుస్తున్నారు. కానీ, ఈ ఫేక్ బెదిరింపుల వెనుకున్న‌ది ఎవ‌ర‌నేది మాత్రం తేల్చ‌లేక‌పోతున్నారు. దీని వ‌ల్ల త‌ర‌చూ కోర్టు విలువైన స‌మ‌యం వృథా అవుతోంద‌ని స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. పోలీసులు పూర్తిస్థాయిలో ద‌ర్యాప్తు, చేప‌ట్టి ఫేక్ బాంబు బెదిరింపుల వెనుక ఉన్న‌దెవ‌రో తేల్చాల‌ని, మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డ‌కుండా నిందితుల‌పై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>