పెద్దచెరువు కట్ట వద్ద రోడ్డు విస్తరించాలి: కలెక్టర్​ చాహత్​ బాజ్​పాయ్​​

కలం, వరంగల్ బ్యూరో: వరంగల్​, కరీంనగర్​ జాతీయ రహదారిలోని హసన్​పర్తి పెద్ద చెరువు మూల మలుపు వద్ద రోడ్డును విస్తరించాలని అధికారులను హనుమకొండ (Hanumakonda) జిల్లా కలెక్టర్​ చాహత్​ బాజ్​పాయ్​​ ఆదేశించారు. సోమవారం అధికారులతో కలసి ఆమె హసన్​పర్తి మూల మలుపు వద్ద రోడ్డును పరిశీలించారు. ఇక్కడ తరచూ ప్రమాదాలు జరుగుతూ ప్రాణాలు పోతున్నాయని ఇటీవల కలెక్టరేట్​లో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్​.నాగరాజు (MLA Nagaraju) ప్రస్తావించారు. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని ఎంపీ కడియం కావ్య, కలెక్టర్​ చాహత్​ బాజ్​పాయ్​​​, సంబంధిత అధికారులను కోరారు. ఈ క్రమంలో హసన్​పర్తి మండల కేంద్రానికి కలెక్టర్​ వచ్చారు. పెద్ద చెరువు కట్ట వద్ద ఉన్న బ్లాక్​స్పాట్​ను జాతీయ రహదారులు, ఆర్అండ్​బి, సాగునీటి పారుదల, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు, రోడ్డు విస్తరణకు ఉన్న అవకాశాలను ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ అక్కడికక్కడే సమీక్షించారు (Hanumakonda). మలుపు ప్రాంతం ఇరుకుగా ఉండడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నట్లు కలెక్టర్​ గుర్తించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ వద్ద రోడ్డు విస్తరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు విస్తరణతో ప్రమాదాలు తగ్గుతాయి కాబట్టి ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దీనిపై జాతీయ రహదారులు, ఆర్అండ్​బి శాఖలు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ (Collector Chahat Bajpai)​ సూచించారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ భరద్వాజ్, ఆర్అం​డ్​బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ ఆర్డీవో రాథోడ్ రమేష్, తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎస్​ఐ, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Read Also: వార్​ ఎఫెక్ట్​ : పాక్​లో స్కూళ్లు మూత.. జీతాల్లో కోత​

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>