కలం, వెబ్ డెస్క్ : ఉత్తర్ప్రదేశ్లోని హమీర్పూర్ (Hamirpur) జిల్లాలో అత్యంత విషాదకర సంఘటన చోటుచేసుకుంది. బెత్వా నదిపై కొత్తగా నిర్మిస్తున్న వంతెన ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్రంగా గాయపడిన మరికొంతమంది కార్మికులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అర్ధరాత్రి సమయంలో కార్మికులంతా ఘాఢ నిద్రలో మునిగిపోయి ఉన్న వేళ ఈ ప్రమాదం సంభవించింది. వంతెన ఒక్కసారిగా కుప్పకూలడంతో, కనురెప్ప మూసి తెరిచేలోపు కార్మికులు శిథిలాల క్రింద చిక్కుకుపోయారు. నిద్రమత్తులోనే ప్రాణాలు కోల్పోవడం అక్కడి వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానిక అధికారులు, సహాయక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

