కలం, వెబ్ డెస్క్ : హర్యానాలోని గురుగ్రామ్ (Gurugram)లో ఒక కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, తనతో కలిసి ఉంటున్న 19 ఏళ్ల యువతిని ఒక యువకుడు అత్యంత క్రూరంగా హింసించాడు. బాధితురాలు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బయోటెక్నాలజీ చదువుతుండగా, ఆమెపై సదరు యువకుడు అమానుషానికి ఒడిగట్టాడు.
బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిందితుడు ఆమె ప్రైవేట్ భాగాలపై శానిటైజర్ పోసి నిప్పంటించాడు. అంతేకాకుండా, ఆ భయానక దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో చిత్రీకరించాడు. ప్రేమ పేరుతో దగ్గరై, పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఇంతటి ఘాతుకానికి పాల్పడ్డాడని ఆమె వాపోయింది. తీవ్ర గాయాలపాలైన బాధితురాలి స్టేట్మెంట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన గురుగ్రామ్ (Gurugram) పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.


