ఘోర అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

కలం, వెబ్‌ డెస్క్ : ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా (Greater Noida) పరిధిలో ఉన్న షాహ్‌బేరి ఫర్నీచర్ మార్కెట్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తినష్టం వాటిల్లింది. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో ఒక దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగానే ఆ మంటలు పక్కనే ఉన్న ఇతర షాపులకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాద తీవ్రతకు మొత్తం ఆరు ఫర్నీచర్ దుకాణాలు పూర్తిగా కాలిబూడిదయ్యాయి.

స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజన్లతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఈ ప్రమాదానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>