కలం, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ (West Bengal) అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ ఆర్.ఎన్.రవి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగం కల్పించిన తనకు కల్పించిన ప్రత్యేక అధికారాలను వినియోగించుకుని.. అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు అధికారికంగా గెజిట్ నోటిఫికేషన్ చేశారు. దీంతో, ఈ నెల 9న బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగుమం అయింది.
రాజీనామాకు ససేమిరా అన్న మమతా..
ఎన్నికల్లో మమతా బెనర్జీ ఓటమి పాలైనా.. రాజీనామా చేసేందుకు ససేమిరా అన్నారు. అవసరమైతే, రాష్ట్రపతి పాలన పెట్టుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ విసిరారు. ఎన్నికలు పూర్తిగా బీజేపీకి అనుకూలంగా జరిగాయని, ఈసీ సహా యంత్రాంగం బీజేపీని గెలిపించడానికి పనిచేశాయని దీదీ విమర్శించారు. దీంతో, బెంగాల్లో ఏం జరగబోతుందనే.. ఉత్కంఠ నెలకొంది. గవర్నర్ అసెంబ్లీ రద్దు చేయడంతో.. ఇక మమత అధికారికంగా మాజీ సీఎం అయిపోయారు.

