కలం ,మహబూబ్ నగర్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహాకార సమాఖ్య (TGSDGCFL) చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరించిన కె. సరిత తిరుపతయ్య ను, హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Whip Yennam) మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పదవీకాలంలో సంస్థ అభివృద్ధి, సంక్షేమానికి విశేష కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

