కలం, వెబ్ డెస్క్: కలం, వెబ్ డెస్క్: ఏపీలోని సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లి (Kummarawandlapally)లో బుధవారం తీవ విషాదం నెలకొంది. ఓ ఇంట్లో సిలిండర్లు పేలడంతో నలుగురు మృతి చెందారు. ఘటనాస్థలంలోనే ఇద్దరు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు చనిపోయారు. మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇంట్లో నిల్వ ఉంచి గ్యాస్ సిలిండర్లు పేలినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలికి చేరుకున్నపోలీసులు పేలుడుపై అనుమానాలతో దర్యాప్తు ప్రారంభించారు. సిలిండర్లు పేలడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

