ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి(Thota Tharani)కి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఫ్రాన్స్(France) ప్రభుత్వం అందించే అత్యున్నత సివిలియన్ అవార్డుల్లో ఒకటైన ‘చెవాలియర్(Chevalier Award)’కు ఆయన ఎంపికయ్యారు. కళ, సాహిత్య రంగాల్లో అసాధారణ కృషి చేసిన వారికి ఫ్రాన్స్ ప్రభుత్వం ఈ అవార్డు అందజేస్తూ ఉంటుంది. భారత సినీ రంగం నుంచి ఈ గౌరవం అందుకున్న వారిలో తోట తరణి కూడా ఒకరుగా నిలవడం గమనార్హం. చెన్నైలోని ఫ్రెంచ్ కాన్సులేట్లో గురువారం నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకుంటారు.
Thota Tharani ప్రతిభకు గుర్తింపు
దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో సేవలందిస్తున్న తోట తరణి, తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో వందలాది సినిమాలకు ఆర్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన సృజనాత్మకత, సెట్స్ రూపకల్పనలోని వైవిధ్యం, చారిత్రక చిత్రాల్లో చూపిన నైపుణ్యం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ‘నాయకన్’, ‘ఇంద్రుడు చంద్రుడు’, ‘జీన్స్’, ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘బాహుబలి’ వంటి సినిమాలతో ఆయన ప్రతిభ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది.
సీఎం స్టాలిన్ అభినందనలు
తరణి ఎంపికపై తమిళనాడు సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘‘భారత సినీ రంగానికి గర్వకారణమైన తరణి గారికి చెవాలియర్ అవార్డు లభించడం ఎంతో ఆనందదాయకం. తమిళ సినీ పరిశ్రమకు మీరు అందించిన సేవలు అమూల్యమైనవి’’ అని పేర్కొన్నారు. తోట తరణి గతంలో రెండు సార్లు జాతీయ అవార్డులు కూడా అందుకున్నారు.
Read Also: వేములవాడలో దర్శనాలు బంద్
Follow Us on: Instagram

