కలం, వెబ్ డెస్క్ : మ్యాచ్అప్స్నే మొత్తం వ్యూహంగా మార్చితే అది పనిచేయదని మాజీ క్రికెటర్ సుబ్రమణియన్ బద్రినాథ్ (Subramaniam Badrinath) వ్యాఖ్యానించారు. అత్యున్నత స్థాయిలో కోచ్ గణాంకాలకు మించి ఆలోచించాల్సిన అవసరం ఉందని సూచించారు. టీ20 వరల్డ్కప్ (T20 World Cup) 2026 సూపర్ ఎయిట్ తొలి మ్యాచ్లో ఆక్షర్ పటేల్ (Axar Patel) ను తప్పించి వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) ను ఎంపిక చేయడం విమర్శలకు దారితీసింది. దక్షిణాఫ్రికా టాప్ ఆర్డర్లో ఎడమచేతి బ్యాట్స్మెన్లు ఉండటమే ఈ నిర్ణయానికి కారణమైంది. కానీ సుందర్ రెండు ఓవర్లు వేసి వికెట్ లేకుండానే నిలిచాడు. భారత్ 76 పరుగుల తేడాతో ఓడిపోయింది.
బద్రీనాథ్(Subramaniam Badrinath) అభిప్రాయం ప్రకారం, మ్యాచ్అప్స్ కేవలం సమాచారం మాత్రమే. ఆటగాడి ఫామ్, ఫిట్నెస్, అనుభవం కూడా సమానంగా ముఖ్యం. మాజీ బౌలర్ లక్ష్మీపతి బాలాజీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎంపికలో వ్యక్తిత్వం, ఒత్తిడి సమయంలో ప్రభావం చూపే సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. ఇప్పుడీ వ్యాఖ్యల నేపథ్యంలో జట్టు వ్యూహంపై చర్చ కొనసాగుతోంది. ముందున్న మ్యాచ్ల్లో భారత్ ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Read Also: బ్యాటర్లు ఫెయిల్ అవ్వడం వల్లే ఓడిపోయాం: అఫ్రిది
Follow Us On: Sharechat

