epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సీఎం రేవంత్‌పై మరోసారి మండిపడ్డ జీవన్ రెడ్డి

సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి(Jeevan Reddy) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్.. ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులకు అన్యాయం చేస్తున్నారని అన్నారు. అనేక విషయాల్లో రేవంత్.. సొంత పార్టీ కోసం ఊడిగం చేసిన కార్యకర్తలను ఏమాత్రం మద్దతు ఇవ్వడం లేదని, పక్క పార్టీ నుంచి వచ్చిన ఫిరాయింపులకు మాత్రం పెద్దపీట వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి ఒరిజినల్ కాంగ్రెస్ వారికి కాకుండా ఫిరాయింపుదారులకు మద్దతు ఇస్తున్నాడు. మా పోటీ పక్కోల్లతో కాదు.. ముఖ్యమంత్రి స్థాయి వారితో మా పోటీ. ఇత్తేసి పొత్తు కూడినట్లు మా కాంగ్రెస్ వాళ్ళతో కాని అభివృద్ది పక్క పార్టీ నుండి వచ్చి చేస్తాడట’’ అని జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

అయితే తన ప్రధాన అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి(Jeevan Reddy) రెబల్‌గా మారారు. అవకాశం దొరికిన ప్రతిసారి పబ్లిక్‌గానే పార్టీపై తన అసంతృప్తి, ఆగ్రహానికి వెళ్లగక్కతున్నారు. ఆఖరికి బీఎస్‌పీ పార్టీ నుంచి ఓ నాయకుడు కాంగ్రెస్‌లో చేరుతున్న క్రమంలో కూడా ‘‘ఇక్కడ ఏముందని వస్తున్నావ్’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా పలు సందర్భాల్లో ‘‘మీరే ఏలుకోండి. మాకెందుకు’’ అంటూ పార్టీ అధిష్టానం, ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also: మరోసారి భగ్గుమన్న రేవంత్ రెడ్డి vs కోమటిరెడ్డి వర్గపోరు

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>