Mobile Popup Ad
Mobile Popup Ad

మహిళపై అత్యాచారం ఆరోపణ.. పీఎస్‌లో లొంగిపోయిన మాజీ సీఐ చిన్నమల్లయ్య

కలం, వెబ్ డెస్క్: ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన మాజీ సీఐ చిన్నమల్లయ్య వ్యవహారం కొలిక్కి వచ్చింది. మహిళపై అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్న చిన్నమల్లయ్య (Chinnamallayya).. ఈరోజు తెల్లవారుఝామునే పల్నాడు జిల్లా వినుకొండ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. ఈ కేసు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన చిన్నమల్లయ్య.. ఎట్టకేలకు నెల రోజుల తర్వాత పోలీసుల ఎదుట లొంగిపోయారు.

వినుకొండ మండలంలోని ఓ గ్రామంలో ఒంటరిగా ఉన్న సమయంలో తనపై అత్యాచారం చేశాడని చిన్నమల్లయ్యపై ఓ మహిళ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టింది. తనను కత్తితో బెదిరించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తన కుటుంబం నిర్వహిస్తున్న నాటు కోళ్ల ఫారం వ్యవహారంలో చిన్నమల్లయ్య పరిచయం ఏర్పడినట్లు తెలిపింది. ఈ మేరకు ఏప్రిల్ 29న వినుకొండ రూరల్ పోలీసు స్టేషన్ లో అతనిపై కేసు నమోదైంది. ఈ వ్యవహారం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారడంతో చిన్నమల్లయ్యను విధుల నుంచి తొలగిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిన్నమల్లయ్యని ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తూ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసు ముందస్తు బెయిల్ కోసం ఇటు మొదట హైకోర్టులో, ఆ తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. కోర్టుల నుంచి ఊరట లభించకపోవడంతో ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియక చిన్నమల్లయ్య తీవ్ర ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఒకవైపు పోలీసుల గాలింపు, మరోవైపు కోర్టుల్లో ఎదురుదెబ్బలు, ఉద్యోగం కోల్పోయిన పరిణామాల మధ్య చిన్నమల్లయ్య చివరకు అజ్ఞాతం వీడారు. ఈ నేపథ్యంలో ఆయన వినుకొండ పోలీస్ స్టేషన్ కు చేరుకుని లొంగిపోయారు. అనంతరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని తదుపరి విచారణను ముమ్మరం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>