కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఖేలో ఇండియా విలువిద్య ఎంపికలు చేపట్టారు. ఇందులో ప్రతిభ కనబర్చిన ఐదుగురు క్రీడాకారులు రిత్విక్, సాత్విక్, వర్షిత, శ్రీనిక, లాస్య రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఎంపికైన ఐదుగురు రాష్ట్రస్థాయి సీఎం కప్ విలువిద్య పోటీలలో పాల్గొననున్నారు. రాష్ట్రస్థాయి విలువిద్య సీఎం కప్ (CM Cup) పోటీలు ఖమ్మం (Khammam) లో జరుగనున్నాయి. కాంపౌండ్, రికవ్ ఇండియన్ రౌండ్ విభాగాల్లో ఎంపికలు జరుగగా.. విలువిద్య శిక్షకులు మురళి రవీందర్లు పాల్గొన్నారు.
Read Also: ఆ మూడు కేసులు సీబీఐకి ఇస్తామన్న సీఎం రేవంత్
Follow Us On: Instagram


