epaper
Wednesday, February 18, 2026
epaper

కాంతారా నటుడికి ఈడీ సమన్లు

కలం, వెబ్​డెస్క్​: శబరిమల బంగారం చోరీ (Sabarimala Gold Theft) కేసులో మరో కీలక పరిణామం. తమిళ నటుడు, కాంతార 1 సినిమా యాక్టర్​ జయరామ్​కు (Jayaram) ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ సమన్లు జారీ చేసింది. వచ్చే వారం విచారణకు హాజరు కావాలని కోరింది. కాగా, ఈ కేసులో ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందం గత వారం జయరామ్​ను విచారించిన సంగతి తెలిసిందే. శబరిమల ఆలయంలో చోరీకి గురైన బంగారు తాపడాలు, ద్వారపాలకుల విగ్రహాలతో చెన్నైలోని జయరామ్​ నివాసంలో ఉన్నికృష్ణన్​ పొట్టి ప్రత్యేక పూజలు చేసిన వీడియో బయటపడడంతో అప్పట్లో సిట్​ ఆయన్ను విచారించింది. ఉన్నికృష్ణన్​తో (Unnikrishnan Potti) ఆయనకు గల సంబంధాలపై, దొంగిలించిన బంగారుతో పూజలు నిర్వహించడంపై సమాధానాలు రాబట్టింది. సిట్​ విచారణలో ప్రధాన నిందితునితో జయరామ్​కు సంబంధాలు ఉన్నట్లు తేలడంతో ఇప్పుడు ఈడీ ఎంటరైంది.

ఈ కేసులో (Sabarimala Gold Theft) జయరామ్​పై సిట్​ రెండు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఒకటి బంగారు తాపడాలు, ద్వారపాలకుల విగ్రహాల చోరీ ప్రధాన నిందితునితో సంబంధాలు, రెండోది దేవస్థాన విగ్రహాలు, వస్తువులతో ఇంట్లో పూజలు చేయడం. ఈ క్రమంలో ఈడీ ఎంటరై జయరామ్​కు నోటీసులు ఇవ్వడం కోలీవుడ్​, మాలీవుడ్​లో సంచలనం సృష్టిస్తోంది.

మరోవైపు శబరిమల కేసులో ఇప్పటివరకు 12 మందిని సిట్​ అరెస్ట్​ చేయగా, వీరిలో ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డ్​ అధికారులు మురారి బాబు, శ్రీకుమార్​కు ఇటీవలే బెయిల్​ వచ్చింది. ఈ కేసు ఛార్జిషీట్​ను 90 రోజుల గడువు లోపల పోలీసులు ఫైల్​ చేయలేకపోవడంతో వాళ్లకు బెయిల్​ దక్కింది.

Read Also: డాన్ పాత్రలో బాలయ్య.. గోపీచంద్ మలినేని ప్లాన్ అదిరిందిగా

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>