epaper
Wednesday, February 18, 2026
epaper

మున్సిపాలిటీలకు నిధులిచ్చేది కేంద్రమే : కిషన్​ రెడ్డి

కలం, వెబ్​ డెస్క్​ : మున్సిపాలిటీల అభివృద్ధికి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమేనని సెంట్రల్​ మినిస్టర్​ కిషన్ రెడ్డి (Kishan Reddy) అన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. మున్సిపల్​ ఎన్నికల వేళ బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నాయని, విచ్చలవిడిగా డబ్బులు పంచుతున్నాయని కిషన్​ రెడ్డి ఆరోపించారు. ‘మోడీ వచ్చి మోరీలు శుభ్రం చేస్తారా అంటూ సీఎం రేవంత్​ అడుగుతున్నారు. మరి మున్సిపల్​ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మోరీలు ఊడుస్తారా చేస్తారా?’ అని కిషన్​ రెడ్డి ప్రశ్నించారు.

సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఇది మంచి పద్దతి కాదని సూచించారు. ‘నా పేరును సీఎం మార్చి పిలుస్తున్నారు. నా తల్లిపెట్టిన పేరును మార్చడానికి ఆయన ఎవరు.  రేవంత్​ రెడ్డి తన పేరును రేవంత్​ ఖాన్​ అని మార్చుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఎంఐఎంతో కాపురం చేస్తున్నన్ని రోజులు.. కాంగ్రెస్​ పార్టీపై నిప్పులు పోస్తాం’ అని కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు.

Read Also: ఫోన్ ట్యాపింగ్ ఇంకా జరుగుతోంది : బాంబు పేల్చిన పొంగులేటి

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>