కలం, వెబ్ డెస్క్: యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ (Dubai)లోని అన్ని అంతర్జాతీయ విమానాశ్రయాలు మూతపడ్డాయి. భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విమానాశ్రయ యంత్రాంగం ప్రకటించింది. ప్రయాణికులు ఎవరూ ఎయిర్పోర్టులకు రావొద్దని, తమ విమాన సమాచారం కోసం ఆయా ఎయిర్లైన్స్ సంస్థలను సంప్రదించాలని సూచనలు జారీ చేసింది. దుబాయ్ విమానాశ్రయాల మూసివేత ప్రభావం భారతీయ విమానయాన రంగంపై కూడా భారీగా పడింది. ఎయిర్ ఇండియా, ఇండిగో వంటి ప్రముఖ సంస్థలు తమ సర్వీసులను రద్దు చేయడంతో, భారత్లోని ప్రధాన విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గమ్యస్థానాలకు చేరుకోలేక ఎయిర్పోర్టు (Airports)ల్లోనే ఉండిపోయారు.

