కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలోని భద్రాచలం (Bhadrachalam) ఇసుక ర్యాంప్ వద్ద పోలీసులు బైక్ పై తరలిస్తున్న 7.4 కేజీల ఎండు గంజాయిని సీజ్ చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్సైజ్ ఎస్ఐ శ్రీహరి వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో, నెంబర్ ప్లేట్ లేకుండా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని అనుమానంతో ఆపి తనిఖీ చేశారు. పరిశీలనలో 7.4 కేజీల ఎండు గంజాయి (Dry Ganja) గుర్తించబడింది.
గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా సిద్దిపేట జిల్లాకు చెందిన బొడ్డు చందు, కూరాకుల రోహిత్ అని గుర్తించారు. అనంతరం పోలీసులు బైక్, రెండు మొబైల్ ఫోన్లు, సీజ్ చేసిన గంజాయిని, ఇద్దరు నిందితులను భద్రాచలం ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించి, దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు.

