కలం, వెబ్ డెస్క్ : ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన జలసంధిని తానే స్వయంగా మూసివేయించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాంతాన్ని తెరిచేందుకు ప్రపంచ దేశాలన్నీ అంగీకరించినప్పటికీ, అమెరికా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తాను మాత్రం దానికి విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. జలసంధిని తెరిస్తే ఎదుటి పక్షానికి రోజుకు దాదాపు 500 మిలియన్ డాలర్ల ఆదాయం సమకూరుతుందని, అంత పెద్ద మొత్తంలో వారు డబ్బు సంపాదించడం తనకు ఇష్టం లేకనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నానని ట్రంప్ తెలిపారు.
ఈ అంశంపై అంతర్జాతీయంగా అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్న సమయంలో, తాను మాత్రం ఆదాయ లెక్కలను గమనించి అడ్డుకున్నట్లు ఆయన వివరించారు. అమెరికా ఆర్థిక, వ్యూహాత్మక ప్రయోజనాలే తనకు ముఖ్యమని, అందుకే ప్రపంచ దేశాల ఒత్తిడిని పక్కన పెట్టి మరీ ఆ జలసంధిని మూసి ఉంచేలా చర్యలు తీసుకున్నానని ఆయన పేర్కొన్నారు. ట్రంప్ (Donald Trump) చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి.

