కలం, స్పోర్ట్స్: భారత మహిళల క్రికెట్ జట్టు నాయకత్వంలో మార్పులు చేయాల్సిన సమయం వచ్చిందని బీసీసీఐ మాజీ అధికారిణి డయానా ఎడుల్జీ అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ 17 నుండి 22 వరకు జరిగే ఆసియా గేమ్స్ 2026 పోటీల కోసం టీమిండియా సిద్ధమవుతుండగా ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రస్తుతం హర్మన్ప్రీత్ కౌర్ కెప్టెన్గా కొనసాగుతుండగా, సెప్టెంబర్ 18న నాకౌట్ క్వార్టర్ ఫైనల్లో జపాన్తో భారత్ తలపడనుంది. వచ్చే వన్డే వరల్డ్ కప్ నాటికి హర్మన్ప్రీత్ కౌర్కు 37 ఏళ్ల నుంచి 40 ఏళ్లు దగ్గరపడతాయని ఎడుల్జీ పేర్కొన్నారు. అందుకే స్మృతి మంధానను (Smriti Mandhana) కెప్టెన్ చేసి, నూతన నాయకత్వానికి తగిన సమయం ఇవ్వాలని ఆమె సూచించారు.
వైస్ కెప్టెన్లుగా జెమీమా రోడ్రిగ్స్, షెఫాలీ వర్మ వంటి యువ క్రీడాకారిణులను ఎంపిక చేసి భవిష్యత్తు కోసం సిద్ధం చేయాలని ప్రతిపాదించారు. ఇటీవల దుబాయ్లో జరిగిన మహిళల ఆసియా కప్ 2026లో హాంగ్కాంగ్పై స్మృతి మంధాన 124 పరుగులు చేసి ఫామ్లో ఉన్నారు. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మిథాలీ రాజ్ రికార్డును మంధాన అధిగమించారు. అలాగే అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 18 శతకాలతో అత్యధిక సెంచరీలు చేసిన క్రీడాకారిణిగా నిలిచారు.

