epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

షిర్డీ సాయికి వజ్రాల కిరీటం కానుక

కలం, వెబ్​డెస్క్​: షిర్డీలోని సాయి బాబా (Shirdi Sai Baba) సంస్థాన్​కు ఓ భక్తుడు వజ్రాల కిరీటం బహూకరించాడు. న్యూయర్​ సందర్భంగా గురువారం రాత్రి ఆలయానికి వచ్చిన ఫరీదాబాద్​ నివాసి ప్రదీప్​ మొహంతి అనే భక్తుడు ఈ అపురూప కానుక ఇచ్చాడు. వజ్రాలు పొదిగిన ఈ బంగారు కిరీటం విలువ రూ.80లక్షలు ఉంటుందని సంస్థాన్​ సీఈవో గోరక్ష్​ గడేల్కర్​ (Goraksh Gadilkar) తెలిపారు. 585 గ్రాముల బంగారు, 153 వజ్రాల(24 క్యారెట్ల)తో తయారుచేసిన ఈ కిరీటం బరువు 655 గ్రాములు ఉన్నట్లు చెప్పారు. భక్తుని సమక్షంలో ఈ కిరీటాన్ని కొద్దిసేపు సాయిబాబా విగ్రహంపై అలంకరించారు. ప్రదీప్ మొహంతి, అతని భార్య ప్రతిమ మొహంతిని ట్రస్ట్​ అధికారులు సత్కరించారు.

Read Also: మనం చీరలు కడుతాం.. మనది గొప్ప కల్చర్ : నటి రోహిణి

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>