కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవి పల్లి మండలంలోని మెడికల్ కాలేజీ సమీపంలోని డ్రైనేజీలో మృత దేహం లభ్యం కావడం స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనకు సంబంధించి విషయం తెలియగానే మెడికల్ కాలేజీ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మృత దేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పంచనామ చేసి, మార్చురీ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

