కలం, మహబూబ్ నగర్ బ్యూరో: నారాయణపేట జిల్లా పర్యటనకు వచ్చిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ శాఖ కార్యదర్శి దాసరి హరిచందన (Dasari Harichandana) సింగారం మలుపు దారి వద్ద నిర్మాణం పూర్తయిన హ్యాండ్లూమ్ ఎక్స్ లెన్స్ సెంటర్ను సందర్శించారు. జిల్లా కలెక్టర్ ప్రియాంకతో కలిసి ఇక్కడకు వచ్చిన హరిచందన కేంద్రంలో ఏర్పాటు చేసిన మగ్గాలు, చేనేత కార్మికుల యంత్రాలు, పరికరాలను పరిశీలించారు. మాస్టర్ వీవర్స్తో మాట్లాడారు. అరుణ్య ఆన్లైన్ అమ్మకాల గురించి అడిగి తెలుసుకున్నారు. గోడలపై చిత్రీకరించిన నేతన్నల పెయింటిగ్స్ను ఆసక్తిగా పరిశీలించారు.
Read Also: దిక్కు లేని వృద్ధ కళాకారుడు.. అండగా నిలిచినా ఆనంద్ మహీంద్రా
Follow Us On : WhatsApp

