కలం, వెబ్ డెస్క్: నూతన డీజీపీగా ఇటీవలే బాధ్యతలు చేపట్టిన సీవీ.ఆనంద్ (CV Anand) తన తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అందుకు సంబంధించిన ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో షేర్ చేశారు. ‘నా తల్లిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నాను. ఆమె గత నవంబర్, జనవరి నెలల్లో తీవ్ర అనారోగ్యానికి గురై.. ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటోంది. ఆమె కుమారుడు డీజీపీ కావాలని బలమైన కోరికే, త్వరగా కోలుకునేలా చేసింది. ఇప్పుడు ఆమె చాలా సంతోషంగా ఉన్నారు. అది చూసి నాకు సంతోషంగా ఉంది’ అని పోస్ట్ చేశారు.
Read Also: మెర్సిడెజ్ రీ-ఎంట్రీ: ఫార్ములా 1 రేసుల్లో కుర్రాడి సంచలనం!
Follow Us On : WhatsApp

