దారుణం.. రూ.10ల కర్రీ ఇవ్వలేదని తల్వార్‌తో దాడి

కలం మెదక్ బ్యూరో : సంగారెడ్డి (Sangareddy) జిల్లా అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. భీరంగూడ ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా ఉన్న ఓం శ్రీ సాయి కర్రీ పాయింట్ వద్దకు కర్రీ కోసం వచ్చిన ఓ కస్టమర్ కర్రీ పాయింట్‌లో పనిచేసే వ్యక్తులపై తల్వార్‌తో దాడిచేసిన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. శనివారం రాత్రి ఓ కస్టమర్ ఓం శ్రీసాయి కర్రీ పాయింట్ దగ్గరికి రూ.10ల కర్రీ కోసం వెళ్లాడు. అయితే అక్కడ పనిచేసే వ్యక్తి రూ.10కి కర్రీ ఇవ్వలేదు. దీంతో ఆ కస్టమర్‌కు, కర్రీ పాయింట్‌లో పనిచేసే వ్యక్తులకు మధ్య వాగ్వాదం జరిగింది.

దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన కస్టమర్ కర్రీ పాయింట్‌లో పనిచేసే అన్నదమ్ములు ఉదయ్ (27), అజయ్ (19)లపై తల్వార్‌తో దాడి చేశాడు. ఈ దాడిలో వారి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అమీన్‌పూర్ పోలీసులు గాయపడిన అన్నదమ్ములను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. తల్వార్‌తో దాడిచేసిన వ్యక్తి అంబేద్కర్ కాలనీకి చెందిన జీవరత్నంగా పోలీసులు గుర్తించారు. అనంతరం కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>