కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) మధ్యప్రదేశ్లో వేసిన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అఫిడవిట్లో క్రిమినల్ కేసులు, ఆస్తుల వివరాలు పూర్తిగా వెల్లడించని కారణంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి మీనాక్షి నామినేషన్ను తిరస్కరించినట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే ఏఐసీసీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. తాజాగా రిటర్నింగ్ అధికారి మీనాక్షి నామినేషన్ను రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది.

