కలం, వెబ్ డెస్క్: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో కాంగ్రెస్ పార్టీ మరింత దూకుడు పెంచింది. మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఇప్పటికే మంత్రులకు కీలక బాధ్యతలు అప్పగించారు. పంచాయతీ ఎన్నికలను మించి ఫలితాలు రాబట్టాలని ఆయన దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ హై కమాండ్ సైతం మున్సిపల్ ఎన్నికలపై ప్రత్యేక దృష్టి సారించడంతో మంత్రులు ఆయా జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. కాంగ్రెస్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ, మెజార్టీ మున్సిపల్ సీట్లు దక్కేలా వ్యూహ రచన చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఎన్నికల ప్రచారంలోకి దిగబోతున్నారు. ఫిబ్రవరి 1న అమెరికా నుంచి హైదరాబాద్కు చేరుకుంటారు. ఫిబ్రవరి 2న మంత్రులు, ముఖ్య నేతలతో సమావేశమవుతారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చలు జరపనున్నారు. ఫిబ్రవరి 3 నుంచి మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) పాల్గొంటారు.
మున్నిపల్ ఎన్నికల ప్రచార సభలివే..
ఫిబ్రవరి 3న మిర్యాలగూడ,
4న జగిత్యాల,
5న చేవెళ్ల,
6న భూపాలపల్లి,
7న మెదక్,
8న నిజామాబాద్
Read Also: ఆదాయంలో మూడో వంతు అప్పులే.. 9 నెలల్లో రూ. 66 వేల కోట్లు
Follow Us On: Pinterest


