Mobile Popup Ad
Mobile Popup Ad

10న సీఎం రైతు ఆశీర్వాద సభ

కలం, వెబ్ డెస్క్: ఈ నెల 10వ తేదీన ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో సీఎం (CM Revanth Reddy) రైతు ఆశీర్వాద సభ నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సభా ఏర్పాట్లను మంగళవారం సాయంత్రం తుమ్మల పరిశీలించనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొనే ఈ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

గత నెల 30న ఖమ్మంలో నిర్వహించాల్సిన రైతు ఆశీర్వాద సభ వర్షం కారణంగా రద్దైంది. దీంతో వాయిదా పడిన సభను ఈ నెల 10న నిర్వహించనున్నట్లు మంత్రి తుమ్మల వెల్లడించారు. ముఖ్యమంత్రి (CM Revanth Reddy) సభకు భారీ సంఖ్యలో రైతులు, ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో భద్రత, ఇతర ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>