కలం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి కనుమ నుంచి వరుస పర్యటనలతో బిజీ బిజీగా ఉండనున్నారు. నిర్మల్ నుంచి మొదలు యూఎస్ వరకు ఆయన టూర్లు ఉండనున్నాయి. ఈ నెల 16న నిర్మల్ జిల్లాలో ముఖ్యమంత్రి (Revanth Reddy) పర్యటిస్తారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ ప్రసంగించనున్నారు. 18న మేడారంలో (Medaram) మంత్రులతో కలిసి బస చేస్తారు. మరుసటి రోజు సమ్మక్క సారలమ్మను దర్శించుకొని అదే రాత్రి దావోస్ పర్యటనకు (Davos Tour) వెళ్తారు. ఆ తర్వాత అమెరికాలోనూ పర్యటించి.. ఫిబ్రవరి 1న తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
సీఎ రేవంత్ టూర్ల షెడ్యూల్ ఇదీ:
ఈ నెల 16: నిర్మల్ జిల్లాలో పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు.. అనంతరం బహిరంగ సభ.
ఈ నెల 17: మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో భాగంగా జడ్చర్ల ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన.. అనంతరం పబ్లిక్ మీటింగ్.
ఈ నెల 18: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటన. పాలేరు నియోజకవర్గంలో జరిగే సభకు హాజరు. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి తో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు తదితరుల హాజరు. ఖమ్మం పట్టణంలో సీపీఐ బహిరంగ సభలో పాల్గొననున్న సీఎం రేవంత్.
ఈ నెల 18 రాత్రి: మేడారంలో మంత్రులతో కలిసి సీఎం బస.
ఈ నెల 19: కుటుంబ సభ్యులతో కలిసి అడవి తల్లులు సమ్మక్క సారలమ్మను దర్శించుకోనున్న ముఖ్యమంత్రి.
దావోస్ టు అమెరికా !
ఈ నెల 19న మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకున్న అనంతరం అదే రోజు రాత్రి దావోస్ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 23 వరకు అక్కడ జరిగే ప్రపంచ ఆర్థిక పెట్టుబడుల అంతర్జాతీయ సదస్సులో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ పర్యటన సాగనుంది. క్యూర్, ప్యూర్, రేర్ (CURE, PURE, RARE) విధానాన్ని అంతర్జాతీయ వేదికగా ఆయన టీఎం ప్రెజెంట్ చేసే అవకాశం ఉంది. ఈ నెల 24న దావోస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అమెరికా వెళ్తారు . ఫిబ్రవరి 1న ఆయన తిరిగి రాష్ట్రానికి చేరుకుంటారు.
Read Also: జీవనప్రమాణాలు మెరుగుపడితేనే నిజమైన అభివృద్ధి : చంద్రబాబు
Follow Us On: X(Twitter)


