కలం, వెబ్ డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) హైదరాబాద్లోని MCRHRDలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా సాగునీటి ప్రాజెక్టుల (Palamuru Irrigation Projects) పురోగతిపై కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని ఆదేశించారు. జిల్లాలోని ఇతర ప్రాజెక్టుల భూసేకరణను కూడా వీలైనంత త్వరగా ముగించాలని తెలిపారు.
భూసేకరణ నిధులు, పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో ఎలాంటి జాప్యం జరగకుండా ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేస్తుందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు జిల్లా మంత్రులు, అధికారులతో నిరంతరం సమీక్షలు నిర్వహించాలని ఆయన (CM Revanth Reddy) సూచించారు. ప్రాజెక్టుల వారీగా ఉన్న అడ్డంకులను అధిగమించి పనులను వేగవంతం చేసేలా దిశానిర్దేశం చేశారు.
ఈ కీలక సమావేశంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డిలతోపాటు ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్లకృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. వీరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు కూడా ఉన్నారు.
Read Also: దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్ గాంధీ ఫైర్!
Follow Us On: WhatsApp

