Mobile Popup Ad
Mobile Popup Ad

భవిష్యత్​ తరానికి బంగారు బాటగా ఫ్యూచర్​ సిటీ: సీఎం రేవంత్​

క‌లం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) నేడు పర్యటించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్​ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్​ను తలదన్నేలా భారత్​ ఫ్యూచర్​ సిటీ నిర్మాణం జరుగుతుందని సీఎం వెల్లడించారు. తన డ్రీమ్​ ప్రాజెక్ట్​ భావి తరానికి బంగారు బాటగా మారుతుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్​ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, నిజాంలు, కులీ కుతుబ్​ షాహీలు నగరాన్ని అద్భుతంగా విస్తరించారని, అందుకే హైదరాబాద్​, సికింద్రాబాద్​ జంట నగరాలుగా రాణిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్​కు 400 ఏళ్ల చరిత్ర ఉందని, సికింద్రాబాద్​కు 200 ఏళ్ల చరిత్ర ఉందని సీఎం గుర్తు చేశారు.

ఇక సైబరాబాద్ ఒక సాంకేతిక విప్లవం అని,​ రాష్ట్ర ఆదాయంలో 60 శాతం ఆదాయాన్ని అందించి తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చేసిందని చెప్పారు. సైబరాబాద్​ ప్రాంతంలో ఎకరాకు రూ.200 కోట్లకు పైగా భూముల విలువ ఉందంటే బంగారం కంటే ఎక్కువ విలువ రంగారెడ్డి భూములకే ఉందని సీఎం వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్​ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీ నివసించడానికి, ఆర్మీ ఆయుధాలు దాచుకోవడం వల్లనే జంట నగరాలు శత్రు దుర్భేధ్యంగా మారాయన్నారు.

స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రులు సైబరాబాద్​ నగరాన్ని గొప్ప నగరంగా నిర్మించి ప్రపంచానికి అందించారన్నారు. నాడు సైతం హైటెక్​ సిటీని వద్దన్న వారు, ఓఆర్ఆర్​ను అడ్డుకున్న వారు ఉన్నారన్నారు. నాటి సీఎంలు మూసీ కంటే ఎక్కువ విషాన్ని కడుపులో పెట్టుకొని ఇక్కడి ప్రజలు, నగరం అభివృద్ధి చెందవద్దని విషం చిమ్మారన్నారు. నాటి సీఎంలు ఓఆర్ఆర్, హైటెక్​ సిటీ, ఐటీ కంపెనీలు, ఎయిర్​ పోర్ట్​, గూగూల్​, ఇన్​ఫోసిస్​ వంటి సంస్థలు తీసుకురాకుండా ఉండి ఉంటే నేడు పది లక్షల మంది తెలంగాణ యువత ప్రపంచం నలుమూలలా ఐటీ నిపుణులుగా రాణించే వారా? అని ప్రశ్నించారు.

ఫ్యూచర్​ సిటీని (Future City) అడ్డుకునేందుకు కొందరు రాక్షసులు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth) ఆరోపించారు. ఇది ప్రస్తుత యువత భవిష్యత్​తో పాటు, రానున్న తరాలకు, ప్రపంచానికే గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న గొప్ప సంకల్పాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్యూచర్​ సిటీని అడ్డుకుంటామని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్​ సిటీని అడ్డుకుంటే వారికి రానున్న ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని పేర్కొన్నారు. రానున్న ఎనిమిదేళ్లలో ఫ్యూచర్​ సిటీని పూర్తి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు. 2034 నాటికి భారత్​ ఫ్యూచర్​ సిటీ వన్​ ట్రిలియన్​ డాలర్​ ఎకానమీకి వేదిక కావాలన్నారు. ఈ సిటీ రానున్న రోజుల్లో టోక్యో, న్యూయార్క్​, సింగపూర్​ వంటి నగరాలతో పోటీ పడే నగరంగా రూపొందాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం రేవంత్​ తెలిపారు.

Read Also: కేసీఆర్‌పై పూలు చల్లి బతుకమ్మ కుంట కబ్జా: సీఎం రేవంత్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>