కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో పెట్రోల్ బంకులు మూసీవేతపై ముఖమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్పందించారు. రాష్ట్రంలో పెట్రోల్ కొరత, బంకుల బంద్ పై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పౌర సరఫరాల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. పెట్రోల్ బంకుల యాజమాన్యాలు, ఆయిల్ సంస్థల డీలర్లతో మాట్లాడాలని అధికారులకు సూచించారు. పెట్రోల్ సమస్యలు రాకుండా జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. కాగా, రాష్ట్రంలో పెట్రోల్ సరఫరా తగ్గడంతో పలు జిల్లాల్లో బంకులు మూతపడ్డాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
Read Also: గవర్నర్ అబ్దుల్ నజీర్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
Follow Us On: Instagram

