కలం, వెబ్ డెస్క్: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీలో యోగాంధ్ర (Yogandhra) – 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉండవల్లి గుహల వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు (CM Chandrababu), యోగా గురు రాందేవ్ బాబా (Baba Ramdev) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్ర ప్రజలకు యోగాభ్యాసం ప్రాముఖ్యత, ఆరోగ్యకర జీవనశైలి, మానసిక ప్రశాంతతపై అవగాహన కల్పించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని యోగాసనాలు చేయడం పై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏపీని దేశానికి ఆధ్యాత్మిక హబ్గా తీర్చిదిద్దుతామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు.
Read Also: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతికి మారిటైమ్ బోర్డు
Follow Us On: Instagram

