కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని సముద్ర రంగానికి సంబంధించిన ప్రధాన సంస్థ అయిన ఏపీ మారిటైమ్ బోర్డు (APMB)ను విశాఖపట్నం నుంచి అమరావతికి తరలిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో నంబర్ 17 విడుదల చేసింది.
ప్రస్తుతం విశాఖలో కొనసాగుతున్న ఏపీఎంబీ కార్యకలాపాలు ఇకపై అమరావతి నుంచి నిర్వహించబడనున్నాయి. పరిపాలనా సమన్వయం మెరుగుపరచడం, నిర్ణయ ప్రక్రియ వేగవంతం చేయడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2019లో అప్పటి ప్రభుత్వం ఏపీఎంబీని కాకినాడ నుంచి విశాఖపట్నానికి మార్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి సంస్థను అమరావతికి తరలించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

