కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలోని గ్రామ పంచాయతీ (Gram Panchayats)లకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం తాజాగా నిధులు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం నిధులలో భాగంగా ప్రభుత్వం 387 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీనికి ముందే తొలి విడత కింద కేంద్ర ప్రభుత్వం 259.36 కోట్ల రూపాయలను విడుదల చేసింది.
తాజా నిధులతో కలిపి మొత్తం 646.46 కోట్ల రూపాయలను రాష్ట్రంలోని పంచాయతీ (Gram Panchayats)లకు కేంద్రం కేటాయించినట్లయింది. అయితే ప్రస్తుత రెండు విడతల్లో కొంత మొత్తం విడుదలైనప్పటికీ, గ్రామ పంచాయతీలకు సంబంధించి ఇంకా దాదాపు 2400 కోట్ల రూపాయల నిధులు పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది.
Read Also: మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద కొండ ముచ్చు ఫోటో
Follow Us On : WhatsApp


