కలం, వెబ్ డెస్క్: పశ్చిమాసియాలో యుద్ధం ప్రభావం ఎల్పీజీ గ్యాస్ ఉత్పత్తిపై పడింది. దీంతో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా గృహ వినియోగానికి గ్యాస్(Domestic LPG) సరఫరాలో ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్ణయించింది. ఎల్పీజీ ఉత్పత్తి పెంచాలని, గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్ని రిఫైనరీలకూ ఆదేశాలు జారీ చేసింది. ప్రొఫేన్, బ్యూటేన్ గ్యాస్ను పెట్రో కెమికల్ ఉత్పత్తులకు కాకుండా, ఎక్కువగా ఎల్పీజీకి వాడాలని చెప్పింది. ఈ గ్యాస్ను ప్రభుత్వ రంగ మార్కెటింగ్ కంపెనీలపైన ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ కంపెనీలకే మాత్రమే విక్రయించాలని చెప్పింది. కమర్షియల్, ఇండస్ట్రియల్, పెట్రోకెమికల్ రంగాలకు సరఫరాపై పరిమితులు విధించింది. అలాగే, వంటింటి వినియోగాలనికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గ్యాస్ సిలిండర్లు అందుబాటులో ఉండాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ క్రమంలో రేపటి నుంచి 19.5కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోనుంది.
కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు చర్యలు ప్రారంభించాయి. ఆంధ్రప్రదేశ్లో బల్క్ కమర్షియల్ వినియోగానికి గ్యాస్ సరఫరా నిలిపివేశారు. మరికొన్ని రాష్ట్రాలు ఇదే బాటలో పయనిస్తున్నాయి. కమర్షియల్ గ్యాస్ సరఫరా నిలిపివేయనుండడంతో నగరాలు, టౌన్లలోని రెస్టారెంట్లు, హోటళ్లు ముందు జాగ్రత్తగా బుకింగ్స్ పెంచాయి. తిరుపతిలో గ్యాస్ బుకింగ్స్ అనూహ్యంగా పెరిగాయి. కాగా, గత కొన్నేళ్లుగా దేశంతో ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, ఎల్పీజీ(Domestic LPG) అవసరాల్లో సుమారు 60 శాతం వరకు భారత్ దిగుమతులపై ఆధారపడుతోంది. దేశ ఆర్థిక వృద్ధితో పాటు వంటింటికి గ్యాస్ సిలిండర్ల వినియోగం పెరుగుతోంది.
Read Also: విద్యార్థులకు గుడ్న్యూస్.. మధ్యాహ్న భోజనంలో చేపలు
Follow Us On: Youtube

