కలం, వెబ్ డెస్క్ : సీబీఎస్ఈ (CBSE) పదవ తరగతి విద్యార్థులకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ఏటా రెండుసార్లు బోర్డు పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయంలో భాగంగా, రెండో విడత పరీక్షల షెడ్యూల్ను తాజాగా విడుదల చేసింది. మే 15వ తేదీన ప్రారంభం కానున్న ఈ పరీక్షలు మే 21వ తేదీ వరకు కొనసాగుతాయి. ఇదే సమయంలో ఇంప్రూవ్మెంట్, కంపార్ట్మెంట్ రాసే విద్యార్థులకు మే 30 వరకు పరీక్షలు జరుగుతాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 17న ప్రధాన వార్షిక పరీక్షలు ప్రారంభం కాగా, ఇప్పుడు రెండో విడత పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల ఫలితాలను జూన్ చివరి వారంలో లేదా జూలై మొదటి వారంలో విడుదల చేసేందుకు బోర్డు కసరత్తు చేస్తోంది. విద్యార్థులు మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సంప్రదించవచ్చు.

