కలం, వరంగల్ బ్యూరో: తాడ్వాయి మండలం మేడారం (Medaram) సమ్మక్క-సారలమ్మల దర్శనం ముగించుకుని తిరుగు ప్రయాణమైన భక్తుల కారు ప్రమాదానికి గురై ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేటకు చెందిన సాయి తన స్నేహితులు అనిల్, అజయ్లతో కలిసి కారులో మేడారం వచ్చారు. సోమవారం సాయంత్రం తిరుగు ప్రయాణంలో కారు టైరు పేలిపోవడంతో నియంత్రణ కోల్పోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయి అక్కడికక్కడే మృతి చెందగా, అనిల్, అజయ్ గాయపడ్డారు.

