కలం, వెబ్ డెస్క్: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు (Central Government Employees) ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరికి 2 శాతం డీఏ పెంచుతూ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ డీఏ పెంపుపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళనకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఉద్యోగుల వేతనాలపై 8వ వేతన కమిషన్ ప్రతిపాదనలు ఇంకా పరిశీలనలో ఉండడంతో ఆందోనళకు దిగనున్నారు. ఈ నేపథ్యంలో డీఏ పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం 60 శాతానికి చేరింది. ఈ ఏడాది జనవరి నుంచే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ పెంపు వర్తించనుంది.
Read Also: బీజేపీ బ్రహ్మాస్త్రానికి బ్రేక్ వేసిన ‘ఇండియా’
Follow Us On : WhatsApp

