కలం, డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ను సిట్ అధికారులు నేడు విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. బీఆర్ ఎస్వీ (BRSV) నేతలు హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ ను ముట్టడించారు. నల్లజెండాలతో మినిస్టర్ క్వార్టర్స్ ను బీఆర్ ఎస్వీ (BRSV) నేతలు ముట్టడించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్, తుంగ బాలును పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా చోట్ల బీఆర్ ఎస్ నేతల నిరసనలు ఉద్రిక్తతకు దారి తీస్తుండగా.. పోలీసులు అరెస్టులు కొనసాగిస్తున్నారు.
Read Also: బిఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ ను ఆయుధంలా వాడుకుంది : మంత్రి పొన్నం ప్రభాకర్
Follow Us On: Youtube


