ఆ మీడియా‌‌ సంస్థపై చర్యలు తీసుకోండి: మండలి చైర్మన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు

కలం, వెబ్ డెస్క్: ‘సార్ .. నాకు ఓ మీడియా చానల్‌లో అవమానం జరిగింది. వెంటనే సదరు మీడియా సంస్థపై చర్యలు తీసుకోండి’ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, ఆ పార్టీ ఎమ్మెల్సీల (BRS MLCs) బృందం మండలి చైర్మన్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. ఇటీవల తక్కళ్లపల్లి రవీందర్ రావు ఏబీఎన్ చానల్‌లో డిబేట్‌లో పాల్గొన్నారు. ఆ సమయంలో మోడరేటర్‌కు, తక్కెళ్ళపల్లి రవీందర్‌రావుకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం సాగింది. చివరకు మోడరేటర్ సహనం కోల్పోయి తక్కళ్లపల్లి రవీందర్ రావును ‘గెట్ అవుట్’ అన్నారు.

ఈ ఘటనను బీఆర్ఎస్ పార్టీ చాలా సీరియస్‌గా తీసుకున్నది. సదరు మీడియా చానల్‌ను నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. పార్టీ ప్రతినిధులు ఎవరూ ఓ మీడియా చానల్ కు వెళ్లొద్దని ఆదేశించింది. ఇదెలా ఉండగా మంగళవారం శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదన చారి నేతృత్వంలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కలిసి ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీలు (BRS MLCs) తక్కళ్లపల్లి రవీందర్ రావు వెంట, విప్ దేశపతి శ్రీనివాస్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, నవీన్ కుమార్ రెడ్డి తదితరులు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

Read Also: ఇండియా ఈయూ డీల్ : మన పరిశ్రమలకు భారీ బూస్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>