మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపు!

క‌లం, వెబ్ డెస్క్‌: మహారాష్ట్ర అసెంబ్లీ (Maharashtra Assembly)కి బాంబు బెదిరింపు రావ‌డం క‌ల‌క‌లం రేపింది. అసెంబ్లీలో బాంబు ఉందంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈరోజు ఉద‌యం ఈమెయిల్ పంపించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే బాంబ్ స్క్వాడ్‌ను రంగంలోకి దించారు. అసెంబ్లీలో అణువ‌ణువు తనిఖీలు చేస్తున్నారు. భద్రతా కారణాల దృష్ట్యా అక్కడున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించారు. ఇప్ప‌టికే దేశంలో స్కూళ్లు, ఎయిర్ పోర్టులు, హోట‌ళ్లు, కోర్టుకు ఎన్నో సార్లు బాంబు బెదిరింపు (Bomb Threat)లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో ఈ బెదిరింపు మెయిల్ నిజమా? ఫేక్ ఆ? అన్నది విచారణలో తేలాల్సి ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>