ఫిబ్ర‌వ‌రి 18న ఏపీకి బిల్‌గేట్స్..!

క‌లం, వెబ్ డెస్క్‌: మైక్రోసాఫ్ట్ సంస్థ అధినేత బిల్‌గేట్స్(Bill Gates) ఫిబ్ర‌వ‌రి 18న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రానున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి(Amaravati)లో సీఎం చంద్ర‌బాబుతో భేటీ కానున్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఏడాది క్రితం బిల్ గేట్స్ కు చెందిన ప‌లు సంస్థ‌ల‌తో కొన్ని ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ ఒప్పందాల‌పై చ‌ర్చించేందుకే ఆయ‌న ఏపీకి వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో బిల్‌గేట్స్ వ్య‌వ‌సాయం, సాంకేతిక‌త‌, ఆరోగ్య రంగాల్లో ప‌లు కీల‌క అంశాల‌పై సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించ‌నున్నారు. అమ‌రావ‌తిలో మ‌రిన్ని పెట్టుబ‌డులు పెట్టే దిశ‌గా చ‌ర్చ‌లు జ‌రుగ‌నున్న‌ట్లు స‌మాచారం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>