కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లక్ష్యంగా బీజేపీ శాసనసభాపక్ష నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) తీవ్ర ఆరోపణలు చేశారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన అక్రమాలపై తన వద్ద అన్ని ఆధారాలు సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బహిరంగ చర్చకు రాగలరా అని మంత్రి పొంగులేటికి సవాల్ విసిరారు.
తన వద్ద ఉన్న ఆధారాలు, సాక్ష్యాలను త్వరలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED), కేంద్రీయ దర్యాప్తు సంస్థ (CBI)లకు అప్పగించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, ఈ సమగ్ర వ్యవహారం, ఆరోపణలకు సంబంధించిన ఆధారాలతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా లేఖ రాయబోతున్నట్లు తెలిపారు.

