మంగళసూత్రాలు, బొట్టు ధరిస్తే సస్పెండ్​ చేస్తాం.. డీజీపీ ఉత్తర్వులు

కలం, వెబ్​ డెస్క్​ : యూనిఫాంలో ఉన్నప్పుడు పోలీసు సిబ్బంది మంగళసూత్రాలు, తిలకం వంటి మతపరమైన ఆభరాణాలు ధరిస్తే విధుల్లో నుంచి సస్పెండ్​ చేస్తామని బిహార్​ డీజీపీ (Bihar DGP) వినయ్​ కుమార్​ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయ, సామాజిక అలజడులకు కారణమయింది. పోలీస్​ క్రమశిక్షణ చర్యల్లో భాగంగా బిహార్ పోలీస్​ ఉన్నతాధికారులు ఇటీవల కఠిన చర్యలు తీసుకున్నారు.

యూనిఫాంలో ఉన్నప్పుడు సోషల్​ మీడియాను దుర్వినియోగం చేసినందుకు సుమారు 40 నుంచి 50 మంది పోలీస్​ సిబ్బందిని తొలగించారు. ఈ క్రమంలో ఆన్​ డ్యూటీలో ఉన్నప్పుడు డ్రెస్​ కోడ్​ ను ఖచ్చితంగా పాటించాలని అధికారులు సూచనలు జారీ చేశారు. వీటిలో పోలీస్​ సిబ్బంది.. తిలకం వంటి చిహ్నాలు పెట్టుకోవడానికి అనుమతి లేదు.

అలాగే, మహిళా అధికారులు యూనిఫాంలో ఉన్నప్పుడు గాజులు, కంకణాలు, మంగళసూత్రాలు, ముక్కుపుడక, కమ్మలు లాంటి ఆభరణాలతో పాటు మేకప్​ ధరించడంపై నిషేధం విధించారు. డీజీపీ (Bihar DGP) జారీ చేసిన ఉత్తర్వులు రాష్ట్రంలో తీవ్ర విమర్శలకు దారి తీశాయి. ఈ నిర్ణయం మతపరమైన మనోభావాలు దెబ్బతీస్తాయంటున్నారు. మరోవైపు బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందూ సంఘాలు ఉత్తర్వులపై మండిపడుతూ వెంటనే ఆదేశాలను వెనక్కితీసుకోవాలని డిమాండ్​ చేస్తున్నాయి.

Read Also: కవిత వ్యాఖ్యలకు కేసీఆర్ రియాక్షన్‌పై ఉత్కంఠ

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>